కూతురి ‘ప్రేమ’ నిర్ణయం.. తల్లి ఆత్మహత్యాయత్నం 

11 May, 2021 10:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అనంతపురం: ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని తెగేసి చెప్పేసింది. దీంతో ఆమెపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చోళసముద్రం గ్రామానికి చెందిన రాజమ్మ కూతురు ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో రాజమ్మ తన కుమార్తె అదృశ్యమైందని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే.. 8వ తేదీ రాత్రి రాజమ్మ కూతురు ప్రేమించిన వ్యక్తితో కలిసి పోలీసుస్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు పోలీసులు సోమవారం తహసీల్దార్‌ కుమార్‌స్వామి ఎదుట అమ్మాయిని హాజరుపరిచారు. ఆ సందర్భంగా తల్లి రాజమ్మ ఇంటికి రావాల్సిందిగా కూతుర్ని వేడుకుంది. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజమ్మ అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను 108లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.  

చదవండి: కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె

మరిన్ని వార్తలు