ఆక్సిజన్ కొరతపై ప్రధాని మోదీకి ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

8 May, 2021 18:38 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ఆక్సిజన్‌ కొరతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌కు ఎంపీ అవినాష్‌ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో ఆక్సిజన్‌ కొరత వల్ల జరగబోయే నష్ట తీవ్రతను వివరించారు. ఆక్సిజన్ డిమాండ్‌, సరఫరా విశ్లేషణపై వివరాణాత్మక నివేదికనిచ్చారు. కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైఎస్సార్‌ జిల్లాకు రోజుకు.. 54 కేఎల్ లిక్విడ్‌ మెడికల్ ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని కోరారు.
 

మరిన్ని వార్తలు