సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఆక్సిజన్ కొరతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో ఆక్సిజన్ కొరత వల్ల జరగబోయే నష్ట తీవ్రతను వివరించారు. ఆక్సిజన్ డిమాండ్, సరఫరా విశ్లేషణపై వివరాణాత్మక నివేదికనిచ్చారు. కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైఎస్సార్ జిల్లాకు రోజుకు.. 54 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కోరారు.