పార్లమెంటులో కీలక బాధ్యతలు స్వీకరించిన ఎంపీ బాలశౌరి

29 Oct, 2020 19:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు సబ్ ‌ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మచిలీపట్నం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బాలశౌరి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటు లోని అనెక్సీ భవన్‌లో గురువారం ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో అధికారులు ఆర్‌సీ తివారి, రంగారాజన్ భేటీ అయ్యారు. లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన బాలశౌరికి సాదర స్వాగతం పలికిన అధికారులు సమావేశ వివరాలను తెలిపారు. చదవండి: మ‌రోసారి స‌త్తాచాటిన ఏపీ పోలీస్ శాఖ

మరిన్ని వార్తలు