ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ

8 May, 2021 20:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ లేఖ రాశారు. మెడికల్‌ ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌పై 28 నుంచి 12 శాతానికి తగ్గించిన జీఎస్టీని.. సున్నాశాతం స్లాబ్‌లోకి తీసుకురావాలని కోరారు. అంబులెన్స్‌లపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలన్నారు. కరోనా తగ్గే వరకు సున్నాశాతం స్లాబ్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని అత్యవసరంగా సమావేశపరచాలని లేఖలో కోరారు.

మరిన్ని వార్తలు