ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం!

30 Jan, 2021 13:26 IST|Sakshi

ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: ట్విట్టర్‌ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ ‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యగ్యాస్త్రాలు సంధించారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట! అంటూ ఎద్దేవా చేశారు. ‘అధికారంలో ఉన్నప్పుడు గజం స్థలానికి టికానా లేదు. ఆ మదనపల్లి దంపతుల్లాగే సత్యలోకంలో ఉన్నాడు ఈ చంద్రగిరి నాయుడు. తన పిచ్చిని ఎల్లో కుల మీడియాకు పూర్తిగా ఎక్కించేశాడు’ అంటూ చురకలు అంటించారు. చదవండి: రాష్ట్రపతి ప్రసంగంలో విభజన హామీల ప్రస్తావన ఏదీ!

‘‘ఏ రోటికాడ ఆ పాట - ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదే. డీజీపీకి అప్పటి గవర్నర్ ఫోన్ చేస్తేనే తాను సీఎంగా ఉన్నప్పుడు చిందులేశాడు. ఇప్పుడేమో ఉద్యోగులను గవర్నర్ నియంత్రించాలట? మాట మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం!’’ అంటూ విజయసాయిరెడ్డి మరో ట్విట్‌లో ఎద్దేవా చేశారు. చదవండి: యాప్‌పై నిమ్మగడ్డ తెలిసే మాట్లాడుతున్నారా?

మరిన్ని వార్తలు