‘ఊసరవెల్లులను సిగ్గుపడేలా చేశారు’

9 Oct, 2020 12:10 IST|Sakshi

ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: ట్విట్టర్‌ వేదికగా మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘తనను తాను పాతాళంలోకి గిరాటేసుకోవడంలో బాబు గారిని మించిన అనుభవజ్ఞుడు ప్రపంచంలోనే లేరు. రఫేల్ విమానాల కొనుగోళ్లలో ప్రధాని 59 వేల కోట్ల స్కాముకు పాల్పడ్డారని దుమ్మెత్తిపోశాడు. అదే నోటితో రఫేల్ ఫైటర్లతో దేశం శక్తి పెరిగిందని కొనియాడటం ఊసరవెల్లులను సిగ్గుపడేలా చేయడం కాక మరేమిటి!’’ అంటూ విమర్శలు గుప్పించారు. (చదవండి: కరువు నివారణ ప్రాజెక్టులకు సాయం)

మరిన్ని వార్తలు