శ్రీవారిని ద‌ర్శించుకున్న విజ‌య‌సాయిరెడ్డి

28 Sep, 2020 08:41 IST|Sakshi

తిరుమల : తిరుమ‌ల శ్రీవారిని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్  రాజ్యాంగాన్ని రచిస్తే కొంత‌మంది రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. అలాంటి వారికి బుద్దుని ప్రసాదించాలని దేవున్ని కోరుకున్న‌ట్లు తెలిపారు. ఇక తిరుమలలో నిర్వహిస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ధ్వజావరోహణంతో ముగిసిన సంగ‌తి తెలిసిందే.  ఉత్సవాల్లో చివరి రోజైన ఆది వారం ఉదయం శ్రీవారికి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు