మాన్సాస్‌ ట్రస్టు: సుమారు 846 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు

3 Sep, 2021 16:44 IST|Sakshi

విశాఖపట్నం: సింహాచలం దేవస్థాన ఆస్తులను కాపాడుతామని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో  మాట్లాడుతూ..  అశోక్‌ గజపతి రాజు మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవస్థానానికి సంబంధించి రూ. 8 వేల కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు.

ఇంతటి అవినీతికి పాల్పడిని అశోక్‌ గజపతిరాజు ధర్మకర్త? అధర్మకర్తా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, సుమారు 846 ఎకరాల దేవస్థాన భూమిని అన్యాక్రాంతం చేశారని విమర్షించారు.  త్వరలోనే భూ సమస్యను పరిష్కారిస్తామని ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 

చదవండి: ఏపీ పోలీస్‌ శాఖకు 5 జాతీయ అవార్డులు: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

మరిన్ని వార్తలు