సాక్షి, చిత్తూరు: పొలంలో పంటకు పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు ఎవరో కాదు.. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. చిత్తూరు మండలం పిళ్లారిమిట్ట(5 వెంకటాపురం) లో తాను సాగు చేస్తున్న వరి పంటను మంగళవారం ఆయన పరిశీలించారు. పంటకు తెల్ల చీడలు సోకినట్లు గుర్తించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు ఆయన స్వయంగా గంటపాటు పురుగుల మందు స్ప్రే చేయడం విశేషం.