మొహర్రం రోజు పాటించాల్సిన కోవిడ్‌ నిబంధనలు ఇవే!

13 Aug, 2020 08:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కోవిడ్‌–19 నిబంధనలు మొహర్రం పండుగలో భక్తులు తప్పకుండా పాటించాలని మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్‌ ఇలియాజ్‌  ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 20 నుంచి పది రోజులు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. 

పండుగ రోజు పాటించాల్సిన కోవిడ్‌ నియమాలు: 

  •  పీర్ల చావిడి వద్ద ముజావర్లు, ముతవల్లీలు, మేనేజింగ్‌ కమిటీ సభ్యులు కలిసి 10 మందికి మించకుండా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. ప్రజలకు, భక్తులకు తమ ఇళ్లలోనే పాతియా (భోజనం) అందించాలి. 
  •  పీర్ల చావిడి వద్ద శానిటైజర్లు ఉంచాలి. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న పెద్దలు, పిల్లలు పీర్ల చావిడి వద్దకు రాకుండా చూడాలి. 
  •  మొహర్రం (షాహదత్‌) చివరి 9, 10వ రోజుల్లో పది మందికి మించకుండా ఊరేగింపు చేసుకోవచ్చు.
  •  పీర్లచావిడి వద్ద జంతు బలి, ఆర్కెస్ట్రా సంగీత బృందాలు నిషేధం.  æ పై కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, విభాగాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది.

చదవండి: కరోనా కాదంటూ రోదించినా... 

మరిన్ని వార్తలు