ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి కేసు కొట్టివేత

25 Jan, 2022 16:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెరిటేజ్‌ సంస్థకు నాంపల్లి కోర్టు మంగళవారం గట్టిషాక్‌ ఇచ్చింది. గతంలో కన్నబాబు,అంబటి రాంబాబులపై హెరిటేజ్‌ సంస్థ పరువునష్టం కింద నాంపల్లి కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. సరైన ఆధారాలు లేవన్న కారణంతో నాంపల్లి కోర్టు కేసును కొట్టివేసింది.హెరిటేజ్‌ కేసులో సంస్థ అధికారులు సరైన ఆధారాలు చూపలేకపోయారని కోర్టు తెలిపింది. ఈ మేరకు కన్నబాబు, అంబటి రాంబాబులపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు నాంపల్లి కోర్టు పేర్కొంది.


 

మరిన్ని వార్తలు