నారా లోకేష్‌ పర్యటనలో అపశ్రుతి

26 Oct, 2020 16:16 IST|Sakshi

సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో నారా లోకేష్‌ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. తన పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఆకివీడు మండలం సిద్ధాపురంలో ట్రాక్టర్‌ నడిపారు. అయితే ట్రాక్టర్‌ ఒక్కసారిగా అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి ఒరిగింది. దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు ట్రాక్టర్‌ను అదుపు చేసి లోకేష్‌ను కిందకు దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు