కోర్టుకు హాజరైన లోకేశ్‌ 

24 May, 2022 05:16 IST|Sakshi
కోర్టుకి హాజరై బయటకు వస్తున్న లోకేశ్‌

విజయవాడ లీగల్‌: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ నేతలు పలువురు ఓ ధర్నా కేసులో సోమవారం విజయవాడ ఒకటో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడిని 2020 జూన్‌ 12న అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు.

ఆ సమయంలో కోవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంపై దాఖలైన కేసులో మాజీ మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్రలతో పాటు నాయకులు పట్టాభిరామారావు, దేవినేని చంద్రశేఖర్, జాస్తి సాంబశివరావులపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వీరు సోమవారం కోర్టుకు హాజరయ్యారు. విచారించిన న్యాయాధికారి జ్యోత్స్న కేసును జూలై 28కి వాయిదా వేశారు.   

మరిన్ని వార్తలు