వ్యాక్సినేషన్‌పై ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

12 Jan, 2021 03:34 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌. మాట్లాడుతున్న ప్రధాని

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు