అమరావతిలో పేదల ఇళ్లకు CRDA ఆమోదం

3 Apr, 2023 12:48 IST|Sakshi

20 లే అవుట్లలో 48,218 మందికి ఇళ్ల పట్టాలు

1,134.58 ఎకరాల భూమి కేటాయింపు

కనీస మౌలిక సదుపాయాలు కల్పించేలా కార్యాచరణ

మే మొదటి వారంలో పనులు ప్రారంభించేలా కసరత్తు 

సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద అమరావతి ప్రాంతంలో 48,218 మంది పే­దలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిం­చారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా కార్యా­చరణ రూపొందించాలని అధికార యంత్రాం­గానికి సూచించారు. మే నెల మొదటి వా­రం నాటికి పనులు ప్రారంభమయ్యేలా చ­ర్య­లు చే­ప­ట్టాలని నిర్దేశించారు. ఇళ్లులేని పే­ద­ల చి­ర­కాల వాంఛ నెరవేర్చే ఈ కా­ర్య­క్ర­మా­న్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. అమరా­వ­తి­లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటా­యి­స్తూ జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ అ­ధ్య­క్షతన సోమవారం క్యాంపు కార్యా­ల­యంలో జరిగిన సీఆర్‌డీఏ 33వ సమావేశంలో ఈమేరకు ఆమోద ముద్ర వేశారు. 

20 లేఅవుట్లు..
అమరావతి ప్రాంతంలో మొత్తం 20 లే­అ­వుట్లలో 1,134.58 ఎకరాల భూమిని పేద­ల ఇళ్ల కోసం కేటాయించారు. ఉమ్మడి గుంటూ­రు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మంది పేదలు ఉచితంగా ఇళ్ల పట్టాలు పొందను­న్నా­రు. ఐనవోలు, మందడం, కృష్ణాయ­పాలెం, న­వు­లూరు, కురగల్లు, నిడమానూరు ప్రాంతా­ల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలుగా రా­ష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. సీ­ఆర్డీఏ చట్టం సెక్షన్‌ 41(3), (4) ప్రకారం ఆర్‌–5 జోన్‌ ఏర్పాటు చేసి భూములను ఆ ప­రి­ధిలోకి తెచ్చింది. గత ఏడాది అక్టోబరులో అ­భ్యం­తరాలు, సలహాలను స్వీకరించి సీఆర్‌­డీ­ఏ బహిరంగ విచారణ నిర్వహించింది. అనంత­రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇళ్ల ప­ట్టా­ల లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు త­యా­రు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా­ల కలె­క్టర్ల­ను ప్రభుత్వం ఆదేశించింది. న్యాయ­పర­మై­న చిక్కులను పరిష్కరించి పే­ద­లకు ఇళ్ల పట్టాలు అందించేలా ప్రభుత్వం సన్న­ద్ధమైంది. సీఎం సమీక్షలో పురపాలక శాఖ మంత్రి సురేష్, సీఎస్‌ జవహర్‌రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ విజయానంద్, ఆర్‌­అండ్‌బీ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమి­షనర్‌ వివేక్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు