సీఎం ముఖ్య సలహాదారు పదవికి సాహ్ని రాజీనామా

28 Mar, 2021 03:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలంసాహ్ని రాజీనామా చేశారు. రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శనివారం ఆమోదించారు. ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించేందుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా నీలం సాహ్ని సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు