36 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

29 Aug, 2020 18:54 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 62,024 మందికి కరోనా వైరస్‌ పరీక్షలు చేయగా 10,548 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,976 మంది డిశ్చార్జ్‌ అవ్వగా,  ఇప్పటివరకూ మొత్తం 3,12,687 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 82 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 36,03,345 మందికి కరోనా పరీక్షలు చేశారు. 

మరిన్ని వార్తలు