ఏపీలో కొత్తగా 1,578 కరోనా కేసులు

12 Jul, 2021 17:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా1,578 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 22 మంది మృతి చెందారు. తాజాగా 3,041 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌  కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,81,307 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,024 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు