టిక్‌టాక్‌ దంపతుల ఆత్మహత్య!

4 Sep, 2020 08:37 IST|Sakshi

సాక్షి, గుంటూరు : బెల్లంకొండలో శుక్రవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మనస్తాపంతో నవ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పవన్‌, శైలజ టిక్‌టాక్‌ ద్వారా పరిచయమయ్యారు. నెల క్రితమే వారు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. శైలజది చిత్తూరు కాగా, పవన్‌ స్వస్థలం మంగళగిరి. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో శైలజ తల్లిదండ్రులు పవన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన నవదంపతులు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

చదవండి: ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఆత్మహత్య

మరిన్ని వార్తలు