తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు

23 Mar, 2021 03:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికకు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 30 చివరి తేదీ కాగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్‌ 3. ఏప్రిల్‌ 17న ఎన్నిక నిర్వహించి, మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.  

మరిన్ని వార్తలు