ఆ స్థానాల్లో నేడు నామినేషన్లు

28 Feb, 2021 04:16 IST|Sakshi

మృతిచెందిన అభ్యర్థుల స్థానాల్లో కొత్తవారి నుంచి నామినేషన్ల స్వీకరణ

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో గతేడాది నామినేషన్లు వేసిన వారిలో వివిధ కారణాలతో మృతిచెందిన రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థుల స్థానంలో కొత్తవారి నుంచి నామినేషన్లను ఆదివారం స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 9 నగర పాలక సంస్థలు, 35 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలలో నామినేషన్లు వేసిన వారిలో 59 మంది అనారోగ్య, ఇతర కారణాలతో మరణించారు. ఆయా స్థానాల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ విధంగా నామినేషన్లు స్వీకరించే నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు/నగర పంచాయతీలు ఇవీ... 

నగర పాలక సంస్థలు: విశాఖపట్నం, కడప, విజయవాడ, గుంటూరు, కర్నూలు, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు, ఒంగోలు.
పురపాలక సంఘాలు/నగర పంచాయతీలు: తుని, మార్కాపురం, కదిరి, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల, ఆత్మకూరు (నెల్లూరు జిల్లా), హిందూపురం, సూళ్లూరుపేట, పలాస–కాశీబుగ్గ, గొల్లప్రోలు, జంగారెడ్డిగూడెం, తెనాలి, రేపల్లె, చీమకుర్తి, తాడిపత్రి, పుట్టపర్తి, మడకశిర, గూడూరు (కర్నూలు జిల్లా), బద్వేల్, పుత్తూరు, పార్వతీపురం, నెల్లిమర్ల, రామచంద్రాపురం, యేలేశ్వరం, తిరువూరు, చిలకలూరిపేట, గిద్దలూరు, వెంకటగిరి, ధర్మవరం, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆదోని, ప్రొద్దుటూరు, పుంగనూరు.   

మరిన్ని వార్తలు