సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఇంజనీరింగ్ సర్వీస్ విభాగాల్లోని 190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ఫీజును చెల్లించి ఈనెల 21 నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు సూచించారు.