47 హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

12 Jan, 2023 05:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో 47 హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి వైద్య శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. https://dmeaponline.com  వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు. బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టారు. అర్హులైన వైద్యులు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసు­కోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్య­ర్థులకు రూ.750 చొప్పున దరఖాస్తు రుసుం ఉంటుంది.

రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపడతారు. ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ పూర్తి చేసి హాస్పిటల్‌ అడ్మిని­స్ట్రేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ/హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌/ఎంబీఏ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌/ఎంబీఏ హ్యూమన్‌ రీసోర్స్‌ కోర్సులు చేసి, ఇతర అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగు­లకు 10 ఏళ్లు వయోపరిమితి నుంచి మిన­హా­యింపు ఉంటుంది. http://hmfw.ap.gov.in వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను ఉంచారు.   

మరిన్ని వార్తలు