వైఎస్సార్‌ ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్‌

8 Jun, 2022 05:39 IST|Sakshi

20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యా శాఖ సూచన  

ఏఎఫ్‌యూ: కడపలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) వైస్‌ చాన్సలర్‌ పోస్టుకు ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హత కలిగిన వారు 20 రోజుల్లోపు http:// aps che. ap. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖా స్తు చేసుకోవాలని సూచించింది.

2020లో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి ఓఎస్‌డీగా ఆచార్య డి.విజయ్‌కిశోర్‌ను నియమించగా.. ఆయన రెండేళ్లకు పైగా ఇన్‌చార్జి వీసీగా, ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఆయన మాతృసంస్థకు వెళ్లడంతో.. వైవీయూ వైస్‌ చాన్సలర్‌ సూర్యకళావతిని ఇన్‌చార్జి వీసీగా నియమించారు.

ఈ నేపథ్యంలో ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాగా, చలమారెడ్డిపల్లె వద్ద 134 ఎకరాల్లో రూ.458 కోట్లతో నిర్మించనున్న ఈ విశ్వవిద్యాలయానికి సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా జూలై 7న భూమి పూజ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు