ఏపీలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ

1 Nov, 2020 10:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి గ్రామ వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు. 61.94 లక్షల మంది పెన్షనర్లకు ఉదయం నుంచే ఇంటికి వెళ్ళి పెన్షన్ అందిస్తున్నారు. ఈ నెల ప్రభుత్వం రూ.1499.89 కోట్లు విడుదల చేసింది. ఉదయం10 గంటల వరకు 74.99 శాతం పెన్షన్ల‌ పంపిణీ పూర్తయ్యింది. 46.44 లక్షల మందికి రూ. 1108.39 కోట్లు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు