అయ్యో.. ఆటోకెంత కష్టం వచ్చింది

20 Dec, 2020 11:24 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : పరిమితికి మించి ప్రయాణికులు, సరుకులతో ఆటోలు రాకపోకలు సాగించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారుతోంది. ఫలితంగా రోడ్డుపై రాకపోకలు సాగించే వారు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకోవాల్సి వస్తోంది. వెంకటేశ్వరపురంలోని ఓ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌కు చెందిన ఆటోలో వాటర్‌ ప్యాకెట్ల బస్తాలను పరిమితికి మించి శనివారం తరలిస్తుండగా, ఇలా అదుపుతప్పింది. బరువు కారణంగా ముందు టైరు పైకి లేచింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు.  

మరిన్ని వార్తలు