ఎస్పీ చొరవతో సకాలంలో చేరిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌

14 May, 2021 12:20 IST|Sakshi

అనంతపురం : అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు చొరవతో ఆక్సిజన్‌ ఇబ్బందులకు చెక్‌ పడింది. బళ్లారి నుంచి అనంతపురం వరకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటైంది. అయితే పోలీసు ఎస్కార్ట్‌తో కర్ణాటక లోని జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ కేవలం 3 గంటల్లోనే అనంతపురానికి చేరేలా ఎస్పీ సత్యయేసుబాబు చర్యలు తీసుకున్నారు. 

బళ్లారి నుంచి అనంతపురం దాకా దారి పొడవునా పోలీసులను అప్రమత్తం చేసిన ఎస్పీ.. ఆక్సిజన్ ట్యాంకర్ సాఫీగా వెళ్లేలా ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా ఆక్సిజన్ ట్యాంకర్ కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ చొరవతో సకాలంలో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ అనంతపురానికి చేరుకుంది. దీంతో జీజీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కోవిడ్‌ బాధితులకు ఊరట కలిగింది.

మరిన్ని వార్తలు