ఏపీ: రైతు ఖాతాల్లోకి విద్యుత్‌ బిల్లుల సొమ్ము 

8 Jul, 2021 08:30 IST|Sakshi

వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో రూ.3,97,31,348 జమ 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్‌ బిల్లులకు సంబంధించి 3,97,31,348 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమచేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. జూన్‌ నెలలో జరిగిన విద్యుత్‌ వినియోగాన్ని లెక్కించిన తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. ఈ మొత్తాన్ని రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్నట్టు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి జీవోలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు