108, 104 ఉద్యోగులకు వేతన బకాయిల చెల్లింపు

24 May, 2022 05:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 108 అంబులెన్సులు , 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ సర్వీసుల్లో పనిచేస్తున్న 6 వేల మంది ఉద్యోగులకు వేతన బకాయిల చెల్లింపును ప్రారంభించినట్టు అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ సంపత్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

సాంకేతిక కారణాల దృష్ట్యా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సకాలంలో వేతనాలను విడుదల చేయలేకపోయామన్నారు. ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు రావటంతో 2 నెలల వేతన బకాయిలను చెల్లిస్తున్నట్టు వివరించారు.   

మరిన్ని వార్తలు