సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు. మొత్తంమ్మీద గత నాలుగు రోజులుగా 60,98,340 మంది లబ్ధిదారులకు రూ.1,550.59 కోట్లు పింఛన్ల రూపంలో పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 97.86 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయిందని సెర్ప్ అధికారులు ఆదివారం తెలిపారు. మిగతా వారి కోసం సోమవారం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.