Photo Feature: 'పానీ'పట్టు యుద్ధం 

16 May, 2022 13:40 IST|Sakshi

విజయవాడ కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి ఆదివారం మధ్యాహ్నం కోతుల గుంపు వచ్చింది. బాగా దప్పికతో ఉన్నాయో ఏమో.. ఆ కోతులు నీటికోసం వెదుకులాడాయి. ఓ కోతికి నీళ్లబాటిల్‌ దొరింది. అయితే ఎలా తాగాలో అర్థంకాక సతమతమైంది. నీళ్లు తాగేక్రమంలో బాటిల్‌ కిందపడి నీళ్లు నేలపాలయ్యాయి. ఇంతలో ఓ నీళ్ల బక్కెట్‌ కోతుల కంటపడింది. ఒక్కొక్కటిగా బక్కెట్‌ వద్దకు చేరి కడుపునిండా నీళ్లు తాగి దప్పిక తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి.  
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ 

మరిన్ని వార్తలు