PM Modi: అల్లూరి జయంతి వేడుకల హైలైట్స్‌ను షేర్‌ చేసిన ప్రధాని

5 Jul, 2022 19:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు సంబంధించి వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. నిన్న(సోమవారం) అల్లూరి 125 జయంతి వేడుకల్ని పురస్కరించుకుని భీమవరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మోదీ హాజరైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హైలైట్స్‌పై ఒక వీడియోను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.  ఆ కార్యక్రమ ముఖ్యాంశాలను వివరిస్తూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించడం జరిగిందని మోదీ పేర్కొన్నారు.

చదవండి: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ 

అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు