పోలవరానికి పీపీఏ బృందం

29 Dec, 2022 06:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పను­లు, నిర్వాసితులకు పునరావాసం కల్ప­నను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి పోల­వరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో శివ్‌నందకుమార్‌ నేతృత్వంలోని అధికారుల బృందం బుధ­వారం రాజమహేంద్రవరానికి చేరుకుంది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈలు రాజే­శ్‌­కుమార్, వెంకటసుబ్బయ్య, డైరెక్టర్‌ దేవేం­దర్‌రావు ఈ బృందంలో ఉన్నారు. పీపీఏ సీఈ­వోగా శివ్‌నందకుమార్‌ బాధ్యతలు స్వీక­రి­ం­చిన తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పను­లను పరిశీలిస్తుండడం ఇదే తొలి సారి.

గురు­వారం పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీలను పీపీఏ బృందం పరిశీలిస్తుంది. శుక్రవారం ఏలూరు జిల్లాలో తాడ్వాయి, కృష్ణునిపాలెం వద్ద నిర్మిస్తున్న పున­రా­వాస కాలనీలను పరిశీలించి, నిర్వాసి­తు­ల­తో సమావేశమవుతుంది. ఆ తర్వాత ఈ సీజన్‌లో చేయాల్సిన పనులు, నిర్వాసితులకు పునరా­వా­సం కల్పించడంపై ఈఎన్‌సీ సి.నారా­యణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు అధికారులతో పీపీఏ బృందం సమీక్ష సమావేశం నిర్వహించనుంది.  

మరిన్ని వార్తలు