రాష్ట్రపతి చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు

30 Jan, 2021 20:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్ చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 7న రానున్న రాష్ట్రపతి జిల్లాకు రానున్నారు. వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌లో ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 12;10 గంటలకు మదనపల్లికి చేరుకోనున్నారు. 12:30 గంటలకు స్థానిక ఆశ్రమం చేరుకొని వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. అనంతరం 3:20కు మదనపల్లి నుంచి బయలుదేరి 3:40 సదుం చేరుకొంటారు. అక్కడ పిపల్ గ్రూప్ స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడినుంచి 4:50 గంటలకు బెంగుళూరుకు బయలుదేరుతారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను శనివారం రోజు జిల్లా అధికారులు పర్యవేక్షించారు. చదవండి: అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి

మరిన్ని వార్తలు