వరదల ఎఫెక్ట్‌: ముంపులో లంక గ్రామాలు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

11 Aug, 2022 19:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా కృష్ణా, గోదావరి, వంశధారల నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో, లంక గ్రామాలు మరోసారి ముంపునకు గురవుతున్నాయి. 

ఇక, శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.21 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో పది గేట్లు 15 అడుగుల మేర ఎత్తారు. శ్రీశైలం నుంచి మొత్తం 4.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోని నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండటంతో 26 గేట్లు ఎత్తి దిగువకు 3.50 లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు.. పులిచింతల గేట్లు 20 ఎత్తివేత వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి లక్ష క్యూసెక్కులను సముద్రంలోకి చేరుతోంది. కాగా, రాత్రికి వరద ఉద్ధృతి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో, సాగర్‌ దిగువన నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగింది. పోలవరంలోకి 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 48 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. 15 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక, ధవళేశ్వరం నుంచి 13.76 లక్షల క్యూసెక్కులు సముద్రంలకి వచ్చి చేరుతోంది. గొట్టా బ్యారేజ్‌ నుంచి 25 వేల క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి చేరుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్‌ పార్కులు  

మరిన్ని వార్తలు