పాదయాత్రకు నిరసన సెగ.. ఫేక్‌ యాత్రికులారా గో బ్యాక్‌..

4 Oct, 2022 11:55 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. తాడేపల్లిగూడెంలో పాదయాత్రను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. గో బ్యాక్‌ ఫేక్‌ యాత్రికులంటూ ఫ్లైక్సీలు ఏర్పాటయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌  వద్దు.. ఆంధ్రా స్టేట్‌ ముద్దు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. బ్లాక్‌ బెలూన్స్‌ కూడా ఎగరవేశారు.
చదవండి:దుష్ట చతుష్టయం కోసం.. రియల్‌ ఎస్టేటే చంద్రబాబు ఆలోచన’

సీఎం జగన్‌ది స్టేట్‌ గురించి ఆలోచన.. చంద్రబాబుది రియల్‌ ఎస్టేట్‌ గురించి ఆలోచన అంటూ ఫ్లైక్సీలపై స్లోగన్స్‌ ఉన్నాయి. సీఎం జగన్‌ది అభివృద్ధి మంత్రం, చంద్రబాబుది రాజకీయ కుతంత్రం. రాష్ట్రం కోసం సీఎం జగన్‌ ఆరాటం. 26 గ్రామాల కోసం బాబు నకిలీ పోరాటమంటూ ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు