సంక్షేమ స్ఫూర్తి.. పంజాబ్‌లోనూ ఏపీ తరహా పథకం..

28 Mar, 2022 17:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఇంటి వద్దకే రేషన్‌ పంపిణి చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రేషన్‌ దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూసే ఇబ్బందులు ఉండవని, ఒక్క ఫోన్‌ కాల్‌తో రేషన్‌ సరుకులు లబ్దిదారుల ఇంటి ముందు ఉంటాయని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తెలిపారు.
చదవండి: స్టీల్‌ప్లాంట్‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రసంగం

మరిన్ని వార్తలు