CM YS Jagan: సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు, రజని

25 Aug, 2022 17:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన సింధు బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌-2022లో తాను గెలిచిన బంగారు పతకాన్ని చూపించారు. ఈ సందర్భంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో సాధించిన విజయాల పట్ల పీవీ సింధు, రజనీని  సీఎం జగన్‌ అభినందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. 

మరిన్ని వార్తలు