సాక్షి, అమరావతి: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన సింధు బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2022లో తాను గెలిచిన బంగారు పతకాన్ని చూపించారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్లో సాధించిన విజయాల పట్ల పీవీ సింధు, రజనీని సీఎం జగన్ అభినందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు.
క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన రాష్ట్రానికిచెందిన సుప్రసిద్ధ అంతర్జాతీయ క్రీడాకారులు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజని. కామన్వెల్త్ గేమ్స్లో సాధించిన ఘనవిజయాలపట్ల అభినందనలు తెలియజేసిన సీఎం. @Pvsindhu1 #Andhrapradesh pic.twitter.com/ZH1Q4ot7Rx
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 25, 2022