కొండచిలువ పాట్లు.. నాలుగు కోళ్లను మింగేసి ఎటూ కదల్లేక 

19 Jul, 2021 14:28 IST|Sakshi
కోళ్లను మింగుతున్న కొండచిలువ

బొబ్బిలి రూరల్‌: మండలంలో జె.రంగరాయపురంలో ఆదివారం గ్రామానికి చెందిన పూడికూర్మారావు పశువుల శాల వద్ద ఎనిమిది అడుగుల కొండచిలువ కోళ్లగూటిలో దూరి నాలుగు కోళ్లను మింగేసింది. అనంతరం ఎటూ కదల్లేక అక్కడే ఇబ్బంది పడసాగింది. గతంలో కూడా కొండచిలువలు గ్రామంలోకి వచ్చి సందర్భాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. వేగావతి నదిలో నుంచి వచ్చి ఉండొచ్చని చర్చించుకున్నారు.

>
మరిన్ని వార్తలు