ద్వారకా తిరుమల: 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు మండలంలోని గుణ్ణంపల్లి వద్ద దర్శనమిచ్చాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి విశాఖపట్నంకు ట్రక్కు ఆటోలో పరీక్ష ప్రశ్న పత్రాలను భీమడోలు మీదుగా తీసుకెళుతుండగా గుణ్ణంపల్లి వచ్చేసరికి కొన్ని ప్రశ్నపత్రాల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆసమయంలో అటుగా వస్తున్న విద్యార్థులు ఆ పేపర్లను ఏరి, వొబ్బిడి చేశారు. దీనిని గమనించి వెనక్కి వచ్చిన ఆటో డ్రైవర్కు వాటిని విద్యార్థులు అందజేశారు