‘రఘురామకృష్ణరాజు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు’

16 May, 2021 21:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: జీజీహెచ్‌లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య నిపుణుల కమిటీ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. అందులో రఘురామ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వైద్య బృందం నివేదికలో తెలిపింది. ఈ మేరకు వైద్య నిపుణులు ఆ రిపోర్ట్‌ను చదివి న్యాయమూర్తులకు వినిపించారు. రఘురామకు అన్ని పరీక్షలు చేసినట్టు కోర్టుకు వైద్య బృందం తెలిపింది. పరీక్షల్లో రఘురామ ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు పేర్కొన్నారు.

( చదవండి: రఘురామకృష్ణరాజు తీరుపై మండిపడ్డ క్షత్రియ నేతలు )
 

మరిన్ని వార్తలు