జాతీయ రహదారిపై త్రాచు పాము హల్‌చల్‌..

13 Aug, 2020 12:59 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి సెంటర్‌లో ఓ పాము హల్‌చల్‌ చేసింది. జాతీయ రహదారి 216పై వచ్చిన త్రాచు పాము  సుమారు గంటపాటు కదలకుండా అలాగే ఉండిపోయింది. దీనిని చూసేందుకు జనాలు అధిక సంఖ్యలో గుమిగూడారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయ ఏర్పడింది. అనంతరం స్థానికులు కొట్టి చంపడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. (భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో చూడండి!)

మరిన్ని వార్తలు