గుడివాడలో బరిసెలతో ‘రావి’ రౌడీయిజం.. సీఐపై దాడి.. చిరిగిన యూనిఫాం

26 Dec, 2022 04:11 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నాయకులను మాజీ ఎమ్మెల్యే రావి సమక్షంలో రెచ్చగొడుతున్న టీడీపీ నాయకులు

గుడివాడ రూరల్‌: దివంగత నేత వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను ఆదివారం కృష్ణా జి­ల్లా గుడివాడలో టీడీపీ నాయకులు మా­ర­­ణాయుధాలతో అడ్డుకుని బరి తెగిం­­చి ప్రవర్తించారు. రంగా వర్ధంతిని మీరెలా నిర్వహిస్తారంటూ టీడీపీ మాజీ ఎమ్మె­ల్యే రావి వెంకటేశ్వరరావు సమక్షంలో దుర్భా­షలాడారు. దీంతో గుడివాడ మెయిన్‌ రోడ్డు నెహ్రూచౌక్‌ నుంచి రావి టెక్స్‌టైల్స్‌ వరకు రాత్రి ఉద్రిక్తత నెలకొంది.
టీడీపీ నాయకులను చెదరగొడుతున్న వన్‌టౌన్‌ సీఐ గోవిందరాజులు, సిబ్బంది 

టీడీపీ నాయకులు కర్రలు, బరిసెలతో రహదారిపై తిరుగు­తూ ఎమ్మెల్యే కొడాలి నానిని దూషించారు. వారించేందుకు ప్రయత్నించిన వన్‌­టౌన్‌ సీఐ గోవిందరాజులపై దాడికి యత్నించారు. సీఐ యూనిఫాంను చించేశారు. అనం­తరం డీఎస్పీ ఎన్‌.సత్యానందం సిబ్బం­దితో కలసి అక్క­డ­కు చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి పంపేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే స్వయంగా దాడులకు ప్రోత్సహిస్తూ ఉద్రిక్తత రేకెత్తించటాన్ని గుడివాడ ప్రజలు తప్పుబడుతున్నారు. 

మరిన్ని వార్తలు