27, 28 తేదీల్లో ఖాళీల జాబితా ప్రకటన
29 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
నవంబర్ 30న బదిలీల ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం రాత్రి తాత్కాలిక తేదీలతో బదిలీల షెడ్యూల్ను ప్రకటించారు. బదిలీలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ముందు అడహక్ పదోన్నతుల కౌన్సెలింగ్, టీచర్ల సర్దుబాటు ప్రక్రియను ముగించనున్నారు. మొత్తం ప్రక్రియ 43 రోజుల్లో పూర్తయ్యేలా షెడ్యూల్ను రూపొందించారు.