చెన్నై ఆస్పత్రిలో నారాయణ కాలేజ్‌ విద్యార్థి మృతి.. పుట్టినరోజు వేడుకల్లో కత్తిపోటుకు గురై..!

26 Nov, 2022 09:23 IST|Sakshi

సాక్షి, తిరుపతి: రేణిగుంట నారాయణ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న నవదీప్‌ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణ క్యాంపస్‌ హాస్టల్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సమయంలో నవదీప్‌ కత్తిపోటుకు గురయ్యారు.

వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు నవదీప్‌ రైల్వేకోడూరు వాసిగా తెలుస్తోంది. నవదీప్‌ ఒంటిపై గాయాలపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండి: (మహా నగరంలో మాయగాడు.. సివిల్‌ సప్లయీస్‌ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..)

మరిన్ని వార్తలు