రిపబ్లిక్‌ డే పరేడ్‌ రిహార్సల్స్‌లో ఏపీ ప్రభల తీర్థ శకటం

23 Jan, 2023 15:21 IST|Sakshi

ఢిల్లీ:   రిపబ్లిక్‌ డే పరేడ్‌ డ్రస్‌ రిహార్సల్స్‌ల్లో ఏపీ శకటం అలరించింది. రిపబ్లిక్‌ డే పరేడ్‌ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన   పరేడ్‌ డ్రస్‌ రిహార్సల్స్‌ల్లో  ఏపీలోని కోనసీమ ప్రభల తీర్థ శకటం ఆకట్టుకుంది.

పరేడ్‌ అగ్రభాగంలో ఆంధ్రప్రదేశ్‌ శకటం చూపరులను విశేషంగా అలరించింది. శివపార్వతుల విగ్రహాలతో ప్రభల తీర్థాన్ని పరేడ్‌ డ్రస్‌ రిహార్సల్స్‌లో ప్రదర్శించగా, ముందు భాగంగా జోడెడ్ల బండిపై రైతన్న కూర్చొని ఉన్నాడు. 

మరిన్ని వార్తలు