పండుగ ప్రత్యేక రైళ్ల పునరుద్ధరణ

26 Aug, 2021 03:48 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల అవసరాల దృష్ట్యా రైల్వే శాఖ గతంలో నడిపిన పండుగ ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరిగి ప్రకటించే వరకు ఈ రైళ్లు నిర్దేశించిన తేదీల్లో నడవనున్నాయి. ఈనెల 30 నుంచి బరోని–యర్నాకులం ప్రత్యేక రైలు(02521), నవంబర్‌ 3 నుంచి యర్నాకులం–బరోని ఎక్స్‌ప్రెస్‌ (02522), ఈ నెల 31 నుంచి దర్భంగ–మైసూర్‌ (02577), నవంబర్‌ 3 నుంచి మైసూర్‌–దర్భంగ (02578), ఈనెల 29 నుంచి గయా–ఎమ్‌జీఆర్‌ చైన్నై(02389), ఈనెల 31 నుంచి ఎమ్‌జీఆర్‌ చెన్నై–గయా (02390), ఈనెల 27 నుంచి పాటలీపుత్ర–యశ్వంతపూర్‌ (03251), యశ్వంతపూర్‌–పాటలీపుత్ర (03252), ముజఫర్‌పూర్‌–యశ్వంతపూర్‌ (05228), యశ్వంతపూర్‌–ముజఫర్‌పూర్‌ (05227) రైళ్లు నడవనున్నాయి.  

మరిన్ని వార్తలు