సందర్శకులపై ఆంక్షలు: ఆర్కే బీచ్‌ నుంచి వుడా పార్క్ వరకు

7 Aug, 2021 19:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్‌ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ నుంచి వుడా పార్క్ వరకు సందర్శకులపై ఆంక్షలు విధించింది. శని, ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి ఉదయం వరకు సందర్శకుల నో ఎంట్రీ నిబంధనలను అమలు చేస్తోంది. ఆంక్షాల కారణంగా ఆర్కే బీచ్‌ ఖాళీగా దర్శనమిస్తోంది. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు