సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణాధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణాధికారిగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాను నియమించింది. ప్రభుత్వం తరఫున ప్రజెంటింగ్ ఆఫీసర్గా అడ్వొకేట్ సర్వ శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది.